Sri Rama Pattabhishekam: శ్రీరామనవమి సందర్భంగా దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత రోజు దశమి రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పట్టాభిషేకం మహోత్సవం తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచే మిథిలా స్టేడియంకి చేరుకుంటున్నారు. సీతారామ చంద్రస్వామి వారి మహా పట్టాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మిథిలా స్టేడియానికి చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
నిన్న రాములోరి కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమలకు ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాదు అభిజిత్ ముహూర్తంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండవగా జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అంతేకాదు స్వామి వారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగియి. ముఖ్యంగా ముఖ్యంగా అయోధ్య రాముడి జన్మ ప్రదేశమైన అయోధ్యలో బాల రాముడి నుదుటిన సూర్య తిలకం తాకడంతో భక్తులు పులకలించి పోయారు. మరికాసేట్లో భద్రాచలంలో జరగనున్న అపురూపమైన పట్టాభిషేక ఘట్టం చూడడానికి భక్తులు ఇప్పటికే భద్రాచలానికి చేరుకున్నారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









