
Summer Waves: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. బయటకు వెళితే మాడు పగిలిపోతుంది. దీంతో ప్రజలు కూలర్స్, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ప్రజలను ఈ నెల 21వ తేదీ నుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు , ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు వేసవి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెగాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్ర వేడి ప్రభావంతోపాటు వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రానున్న రెండు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఎక్కువ చల్ల (మజ్జిగ), రాగి జావా లేకపోతే ఇతరత్రా కూలింగ్ కలిగించే ద్రవాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
AP లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. వడగాలులు వీస్తున్నాయి. ఈ వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న కోస్తా ప్రాంతంలో 45 మండలాల్లో తీవ్రమైన వడగాలులతో ప్రజలు అల్లాడారు. ఈ రోజు అంటే సోమవారం 34 మండలాల్లో తీవ్రంగా, 171 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ఉంటాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని, అవసరమైతే బయటకు రావాలని వాతావరణశాఖ సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe