Summer Waves: అడుగు బయట పెడితే ఆగమే..! ఈ యేడాది రికార్డ్ ఎండలు..

Summer Waves: తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అంతేకాదు బయట అడుగుపెట్టాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2025, 12:09 PM IST
Summer Waves: అడుగు బయట పెడితే ఆగమే..! ఈ యేడాది రికార్డ్ ఎండలు..

Summer Waves: అడుగు బయట పెడితే ఆగమే.. అవును ఈ యేడాది రికార్డు స్థాయిలో ఎండలు మండిపోనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి.

Add Zee News as a Preferred Source

సాధారణం కన్నా 3.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి వీచే వేడి గాలులతో గాలిలో తేమ శాతం పడిపోనుంది.  ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.

పలు జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. మరోవైపు నిన్న భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కానీ బయటకు రావొద్దని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News