
Telangana BJP MPs: హెచ్సీయూ భూముల వివాదం జాతీయ స్థాయికి చేరింది. అన్ని రంగాల ప్రముఖులు హెచ్సీయూ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. ఈ భూములను కాపాడాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి ఫిర్యాదు వెళ్లింది. వెంటనే భూముల తవ్వకాలు నిలిపివేయాలని.. బుల్డోజర్, జేసీబీలను వెనక్కి పంపాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు కలిశారు. హెచ్సీయూ భూములపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీలు ఇచ్చిన వినతిపత్రంలో ముఖ్యాంశాలు ఇవే ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe