)
Indiramma Sarees: తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ చీరలు పంపిణి కార్యక్రమం నెక్లెస్ రోడ్డులో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మొదటి విడతలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ చీరలను పంపిణి చేయనున్నారు. సిరిసిల్ల నేత కార్మికుల నుంచి రూ. 322 కోట్ల ఖర్చుతో చేనేత చీరలు కొనుగోలు చేశారు. ఈ చీరలను రెండు దశల్లో పంపిణీ చేయనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున చీరల పంపిణీ ప్రారంభించారు. కోటి మంది మహిళలకు చీరలను పంచడమే లక్ష్యంగా.. అర్హులైన ప్రతి స్త్రీకీ ఇందిరమ్మ చీర ను అందజేయాలని ప్రభుత్వం ఆశయం అన్నారు.
సెక్రెటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. అయితే.. చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న కారణంగా.. ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా ఈ పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి డిసెంబర్ 9న అనగా తెలంగాణా తల్లి అవతరణ దినోత్సవం వరకూ కొనసాగనుంది. రెండో దశలో 2026 మార్చి 1 నుంచి మార్చి 8 వరకూ పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలను పంచనున్నారు.
ఇందిరమ్మ పంపిణీకి ఉపయోగించే చీరలను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికులే తయారు చేస్తున్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీపడకూడదన్న సీఎంరేవంత్ రెడ్డి.. పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కోటి మంది మహిళలకు కోటి చీరలను పంచాలని .. అర్హులైన ప్రతి స్త్రీకీ తప్పనిసరిగా ఇందిరమ్మ చీరను అందజేయాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.