)
CM Tour in Kamareddy:భారీ వర్షాలతో అతలా కుతలమైన కామారెడ్డి జిల్లాలో మరికాసేట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించనున్నారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న లింగంపేట మండలం కుర్దు గ్రామంలో పాముల వాగుపై ఉన్న ఆర్.అండ్.బి వంతెనను పరిశీలిస్తారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. అటు వరదల వల్ల పలు ఇండ్లలోని సామానులు కొట్టుకుపోయాయి. నిత్యావసరాలు వర్షాలకు పనికిరాకుండా పోయాయి. మొత్తంగా చెప్పాలంటే నడిరోడ్డుపై నిలబడ్డారు. మరోవైపు వరదలతో కార్లు, టూ వీలర్స్ ఇతర వాహనాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో వారు తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరనున్నారు.
మరోవైపు అదే మండలంలోని బురుగిద్ద గ్రామంలో నష్టపోయిన పలువురు రైతుల పొలాలను పరిశీలించి వారితో మాట్లాడనున్నారు. అనంతరం కామారెడ్డి పట్టణంలో వరద బీభత్సానికి నీటమునిగిన జీఆర్ కాలనీకి వెళ్తారు.
కలెక్టర్ కార్యాలయంలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను రేవంత్ పరిశీలిస్తారు. అనంతరం జిల్లాలో జరిగిన నష్టంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గత గురువారమే జిల్లాలో పర్యటించడానికి ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైనప్పటికీ.. ఆఖరి సమయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వాతావరణం అనుకూలించక పోవడంతో ఆయన వెనుదిరిగారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సాంగ్వీ పరిశీలించారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.