)
Jubilee Hills Bypoll Tension For CM Revanth Reddy: జూబ్లీ హిల్స్ కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో లాబీయింగ్ చేస్తుంటే, మరికొందరు ఏకంగా పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి దక్కబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇవే ప్రశ్నలు గాంధీ భవన్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం గెలుపు గుర్రానికే టికెట్ ఇస్తారని అంటోంది.. ఇక జూబ్లీహిల్స్లో బైపోల్ టికెట్పై అజారుద్దీన్ గంపెడాశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం అయ్యారు. మైనారిటీ కోటాలో తనకు టికెట్ కేటాయించాలని ఆయన అగ్రనేతలను అభ్యర్థించినట్లు సమాచారం. అజార్ టికెట్ విషయమై సోనియాగాంధీ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
గతంలో సొంతంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అజారుద్దీన్ ఈసారి తన ప్రయత్నాలను ఢిల్లీ స్థాయిలో ముమ్మరం చేశారు. ఇప్పుడు ఇదే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అనూహ్యంగా అజారుద్దీన్ తో పాటు కోదండరామ్ ను పెద్దల సభలకు పంపపోతున్నట్టు చెప్పడం జూబ్లీ హిల్స్ నుంచి అజారుద్దీన్ ను తప్పించారు.అజారుద్దీన్ అయితే తాము పోటీ చేస్తామంటూ ఓవైసీ చెప్పడంతో ఆయన్ని తెలివిగా రేసు నుంచి పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ను ఆశిస్తున్నారు. ఆయన సైతం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసినట్టు తెలుస్తోంది. గతంలో నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ కోసం తాను విచారణను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారని సమచారం. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఈ ఇద్దరే కాకుండా, మైనారిటీ కోటాలో టికెట్ ఇస్తే తనకే ఇవ్వాలని మరో నేత ఫిరోజ్ ఖాన్, పట్టుబడుతున్నారు. ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు, నవీన్ యాదవ్ సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా టికెట్ దక్కించుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్లో గెలిచిన అభ్యర్థికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో, ఆశావహుల జాబితా మరింత పెరుగుతోంది.
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలో గెలుపు బాధ్యతలను ముగ్గురు మంత్రులు – పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్లకు అప్పగించింది. అంతేకాకుండా, డివిజన్ల వారీగా కార్పొరేషన్ ఛైర్మన్లను కూడా ఇన్ఛార్జులుగా నియమించి, పకడ్బందీ వ్యూహ రచన చేస్తోంది. స్థానికత, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు వంటి పలు అంశాలను బేరీజు వేసి అభ్యర్థిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే ఒక నివేదికను అధిష్టానానికి సమర్పించినట్టు సమాచారం. సర్వేలు, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాన్నే ఎంపిక చేస్తామని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. దీంతో, టికెట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే జూబ్లీ హిల్స్ టికెట్ ను యువ నేతకే ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.