)
Telangana Colleges Holiday: గతనెలలో సెలవుల జాతర ముగిసింది. ఆగస్టు నెలలో బోలెడు సెలవులు వచ్చాయి. స్కూళ్లకు, కాలేజీలకు వరుస సెలవులతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా సెలవులు కూడా వచ్చాయి. నేషనల్ హాలీడేస్ తో పాటు పండుగలు కూడా వచ్చి సెలవులను పెంచేశాయి.
ఇప్పటికే ఎక్కువ రోజులు సెలవులు రాగా.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాలేజీలు నిరవధికంగా బంద్ కానున్నాయని కాలేజీలన్నీ ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలను విడుదల చేసేంత వరకు కాలేజీలు తెరిచే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పాయి. ప్రభుత్వం నిధులను విడుదల చేసేంత వరకు కళాశాలలను తెరిచే అవకాశం లేదని ప్రకటించారు. కానీ, ఒక్కరోజుకే తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చింది.
దిగొచ్చిన తెలంగాణ సర్కారు..
తెలంగాణ కాలేజీల యాజమాన్యాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన చర్చలు సఫలం అయ్యాయి. సెప్టెంబరు 15 నుంచి నిరవధిక బంద్ ప్రకటించిన తెలంగాణ కాలేజీల మేనేజ్మెంట్ ప్రకటించడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. చర్చలు సఫలం అవ్వడం వల్ల రేపటి నుంచి కాలేజీలన్నీ యథాతథంగా తెరుచుకోనున్నాయి.
ఈ వారంలోనే రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలను చెల్లించనున్నారు. తొలుత రూ. 600 కోట్లను చెల్లిస్తామని ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. మిగిలిన బాకీలను రాబోయే దీపావళికి రూ. 600 కోట్లను విడుదల చేస్తామని తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు చెల్లించని కారణంగా బంద్ నిర్వహిస్తామని ప్రైవేట్ కాలేజీలు హెచ్చరించాయి. ఇంజనీర్స్ డే ను బ్లాక్ డేగా ప్రకటించి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కలిసి నోటీసులు జారీ చేశారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ ప్రకటించిన నేపథ్యంలో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.