)
Employees Health Scheme: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ విధి విధానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామక్రిష్ణారావు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదిత ఈహెచ్ఎస్ విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలు అవుతున్న పలు పథకాలను, ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో నుంచి కొంత డబ్బును జమ చేయడానికి రెడీగా ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, Employees Health Scheme కు సంబంధించిన విధి విధానాలను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమీక్షలో, ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్య పథకాలు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను పరిశీలించి, తెలంగాణకు అనువైన మోడల్ను రూపొందించాలని సూచించారు.
ఉద్యోగులు తమ వేతనంలో కొంత భాగాన్ని ఈ పథకానికి జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎస్ తెలిపారు. ముఖ్యంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధానం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స పొందే అవకాశం ఉండాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7,14,322 మంది ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. దీని అమలుకు సంవత్సరానికి సుమారు 13వందల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు అధికారులు.
ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖలు కలిసి, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న EHS విధానాలపై అధ్యయనం చేసి, త్వరలో సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. నివేదిక ఆధారంగా తుది మార్గదర్శకాలు సిద్ధం కానున్నాయి. ఈ సమీక్షా సమావేశంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్తు, జీఏడీ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కొత్త పథకం అమల్లోకి వస్తే, ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా, నగదు రహిత వైద్యం లభిస్తుంది. ఇది ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.