)
MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దని సూచిస్తూ హెచ్చరించారు. అతని ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులు భావిస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతని ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఎక్కడికీ ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా ఎక్కడికీ వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిపారు. రాజాసింగ్ తరచూ ఒంటరిగా, భద్రతా సిబ్బంది లేకుండానే తిరుగుతుంటారు. అది కూడా సెన్సిటివ్ ప్రాంతాలుగా భావించే తలాబ్ కట్ట, భవానీ నగర్, ఇంజాబోలి, బాబా నగర్, బహదూర్ పుర, సంతోష్ నగర్, యాకుత్ పుర, గోల్కొండ, జిర్రా ప్రాంతాల్లో తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. మే 31 రాత్రి ఇలానే తిరిగినట్టు గుర్తించిన పోలీసులు రాజా సింగ్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని భావిస్తున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్న ఆయనకు ప్రభుత్వం ఒక గన్మెన్ నలుగురు సాయధ సిబ్బందిని కేటాయించింది. ఇక నుంచి ఎక్కడికి వెళ్లినా తప్పకుండా భద్రతా సిబ్బందిని తీసుకెళ్లాల్సిందేనని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతల్ని కాపాడేందుకు, ఆయన ప్రాణాలకు ఉన్న ముప్పుని నివారించేందుకు సహకరించాలని పోలీసులు తెలిపారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదా వివాదాస్పద అంశాల్లో ఉంటూ వార్తల్లోకెక్కడం రాజా సింగ్కు అలవాటు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణాలకు ముప్పుందని పోలీసులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook