)
GHMC New Tax: ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న రేవంత్ సర్కార్ .. ఖాళీ స్థలాలపై పన్ను వసూల్ చేయాలనే ప్లాన్ చేసింది. ఖాళీ ప్లాట్లలో బోర్డులు ఏర్పాటు చేయనుంది. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) చెల్లించాలని బల్దియా అధికారులు చెబుతున్నారు.
భూమి ధర మార్కెట్ రేట్లో 0.05 శాతం వీఎల్టీ వసూల్ చేయనున్నారు. రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్టీ చెల్లించాల్సిన ప్లాట్లు 31వేల వరకు ఉండగా.. వీఎల్టీ వసూలైతే దాదాపు రూ. 110 కోట్ల రూపాయల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు చేరతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.
ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్డీ చెల్లించకపోతే.. బకాయిలున్నట్లు ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్.. ఇచ్చిన హామిల అమలు కోసం సామాన్యులపై పెను భారం మోపనుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.