Bhu Bharati Act: తెలంగాణలో నేటి నుంచి భూ భారతి చట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముందుగా మూడు జిల్లాల పరిధిలోని మూడు మండలాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహిస్తారు.
ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయిం. అదే సమయంలో ధరణిలో అక్రమాలపై త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
అయితే నిన్నటి వరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్ -2020 రద్దు చేసిన ఆ స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో భద్రతాపరమైన పలు సెక్షన్స్ పొందుపరిచారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు పట్టా భూములున్న వాళ్లకు ఎవరు పడితే.. వాళ్లు ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ చట్టం అడ్డు పడుతుంది. ఈ చట్టాన్ని సంబంధఇంచిన కోదండరెడ్డి , మాజీ ఐఎఎస్ రేమండ్ పీటర్, న్యాయ కోవిదుడు భూమి సునీల్ సునీల్ కుమార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చించి భూ భారతి చట్టానికి రూపకల్పన చేశారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









