)
Govt Employees vs Revanth Reddy: దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ సమస్యలు నెలకొన్నాయి. న్యాయపరంగా.. హక్కుగా దక్కాల్సిన ప్రయోజనాలు, డిమాండ్లు తెలంగాణలో ఉద్యోగులకు నెరవేరడం లేదు. రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెండింగ్లో ఉండగా.. మరికొన్ని ఆర్థిక, ఆర్థికయేతర సమస్యలు, డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు.. ఆ తర్వాత మాట ఇచ్చి నిలబెట్టుకోకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్లోని టీఎన్జీఓ భవన్లో ఉద్యోగుల జేఏసీ సమావేశమైంది. పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర కీలక డిమాండ్లు, సమస్యలు పరిష్కరించకపోవడంపై చర్చించారు. రేవంత్ రెడ్డి తమను నమ్మించి మోసం చేయడంపై హాట్హాట్గా చర్చల జరిపారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి ఆల్టిమేటం జారీ చేశారు.
'నెలకు రూ.1,500 కోట్లు విడుదల చేయాలి. హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం' అని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ తమకు వర్తించదని.. ఎలక్షన్ కోడ్ అని ప్రభుత్వం సాకు పెట్టొద్దని రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రజాపాలన అని సంబరాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న 5 డీఏలు ఎప్పుడూ ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తుండడంతో తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
'కొత్త జిల్లాలో సిబ్బంది సరిపోవడం లేదు. ఉద్యోగులను ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఉద్యోగులను ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం చొరవ చూపాలి' అని రేవంత్ రెడ్డికి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఒక సమస్య తీరడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై సహనంతో ఉన్నామని.. ఇక ఓపిక లేదని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తమ నిరసనలు, ఆందోళనలు, ఉద్యమ కార్యాచరణను రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తాము వాయిదా వేసుకున్నామని.. పెండింగ్ బిల్లులు , సమస్యలు పరిష్కరించకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది. హెల్త్ కార్డులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రిటైర్డ్ ఉద్యోగుల కు వెంటనే బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే వచ్చేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్న బెనిఫిట్స్ అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook