Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నియామకాలకు బ్రేక్ వేసింది.
తెలంగాణలో నిర్వహించి గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాదాపు 20 పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయు. వీటిపై తెలంగాణ హైకోర్టు ఇవాళ ఏప్రిల్ 17న విచారణ చేపట్టింది. కేసు విచారణ పూర్తయ్యేవరకు ఎంపికైన గ్రూప్ 1 అభ్యర్ధులకు నియామక పత్రాలు ఇవ్వద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ను ఆదేశించింది. అభ్యర్ధుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించి, నియామక పత్రాలు పెండింగులో ఉంచాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులతో గ్రూప్ 1 అభ్యర్ధుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రేపూ మాపో కొలువుల్లో చేరదామని ఆనందపడుతున్న తరుణంలో కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలతో ఖంగుతిన్నారు.
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్ 1 నియామకాల్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. అసలు గ్రూప్ 1 పరీక్షే రాయని పది మంది పేర్లు ఫలితాల్లో ఉన్నాయనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. పరీక్షల్ని రద్దు చేసి సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాత్రం ఎలాంటి అక్రమాలు జరగలేదని బీఆర్ఎస్ నేతల ఆరోపణల్ని తోసిపుచ్చింది. కొందరు దురుద్దేశంతో ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. చివరికి ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో మొత్తం నియామకాలపై బ్రేక్ పడింది.
Also read: Summer Holidays: తెలంగాణలో విద్యార్ధులకు పండగే, సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి