)
High Court vs HYDRAA: చెరువుల పరిరక్షణ.. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన హైడ్రాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరోసారి న్యాయస్థానం ముందు హైడ్రాకు మొట్టికాయలు పడ్డాయి. హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అకస్మాత్తుగా జేసీబీలు తీసుకువచ్చి పేదల నివాసాలు కూల్చివేస్తుండడంతో హైడ్రా తీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మండిపడింది.
పేదల ఇళ్లే కాకుండా పెద్దలవి (ధనవంతులు) కూడా కూల్చాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదలవి మాత్రమే కూల్చకూడదని స్పష్టం చేసింది. అందరినీ సమానంగా చూడాలని హితవు పలికింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీరాలం ట్యాంక్ పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిని విచారణ చేసిన అనంతరం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. చెరువు పరిరక్షణ అంశం మంచిదేనని కానీ చట్టం దృష్టి సమానమే అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో ఉంటే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి