TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్, పదో తరగతి ఫలితాల విడుదలకు అంతా సిద్ధమైంది. తెలంగాణలో రేపు అంటే ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు విడుదల కానుండగా, పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో లేదా ఏప్రిల్ 26న విడుదల కావచ్చు. ఈ క్రమంలో గ్రేడింగ్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఏపీలో గ్రేడింగ్ విధానం నుంచి మార్కుల విధానం రెండేళ్ల నుంచి అమల్లో ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా గ్రేడింగ్ విధానమే నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది నుంచి మార్కుల విధానం ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే పదో తరగతి ఫలితాల్లో మార్కుల విధానం ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇప్పుడు ఇంటర్ ఫలితాల్లో గ్రేడింగ్ లేదా మార్కుల విధానంపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ ఫలితాల మూల్యాంకనం, మార్కుల కంప్యూటరీకరణ పూర్తయింది. రేపు అంటే ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ఉఫ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.
తెలంగాణలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి మార్చ్ 25 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ మొదటి ఏడాది నుంచి 4.88 లక్షలుంటే రెండో ఏడాది నుంచి 5 లక్షల వరకు ఉన్నారు. ఇక పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 10 వరకు జరిగింది. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in లేదా results. cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు మార్కుల మెమోతో సహా స్క్రీన్పై ప్రత్యక్షమౌతాయి. మార్కుల మెమో డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవచ్చు. ఐవీఆర్ పోర్టల్ నెంబర్ 9240205555 నెంబర్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు నేరుగా తెలుసుకోవచ్చు.
Also read: Heavy Rain Alert: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగుల పడే ప్రమాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి