)
Uttam Kumar Reddy About IAF: IAF సిబ్బంది యొక్క ధైర్యం, త్యాగం మరియు విజయాలను గౌరవించడానికి.. అక్టోబర్ 8న భారత వైమానిక దళ (IAF) 93వ దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వైమానిక దళంలో తాను గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా అప్పటి ఫొటోలను కూడా షేర్ చేశారు.
1932లో ప్రారంభమైన భారత వైమానిక దళం దేశ భద్రతకు మాత్రమే కాదు, ధైర్యానికి, క్రమశిక్షణకు, త్యాగానికి ప్రతీకగా నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత.. మిగ్-21 మరియు మిగ్-23 ఫైటర్ పైలట్గా పనిచేశానని తెలిపారు. అప్పటి రోజులను ఆయన సంతోషంగా గుర్తు చేసుకున్నారు.
భారత వైమానిక దళంలో పనిచేయడమే తన జీవితంలో అత్యుత్తమ దశ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రస్తుత ధైర్యవంతులైన వాయు యోధులను ఎంతో అభినందించారు. ప్రతి ఒక్కరూ దేశ సేవలో నిమగ్నం కావాలని ఉత్తమ్ కుమార్ సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.