Telangana BJP President: ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. పూటకో పేరు సోషల్ మీడియాతో పాటు ప్రముఖ వార్తా ఛానెల్స్ లో వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కిషన్ రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడంతో.. కొత్త అధ్యక్షుడి ప్రకటన దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.
షెడ్యూలు ప్రకారం.. జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలామంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్రావు, మురళీధర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు ఇంకొందరు కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేరళ సహా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్ఠానం మరో రెండు మూడు రోజుల్లో కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించే వరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









