)
Telangana Corp Loss: రాష్ట్రంలో 33 శాతానికి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించడం జరిగిందని, 27 జిల్లాలలోని లక్షా 22 వేల 142 మంది రైతులకు చెందిన పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్డిఆర్ఎప్ కింద ఇసుక మేటలకు ఎకరానికి 7 వేల 285 రూపాయలు, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి 6 వేల 880 రూపాయలు, వర్షాధార పంటలకు 3 వేల 440 రూపాయలు, తోటలకు ఎకరానికి 9 వేల 106 రూపాయిల చొప్పున మొత్తం 70 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు.
గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపి నిధులు అడుగుతామన్నారు.
ఇప్పటికే మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరినట్లు వెల్లడించారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి 10 వేలు రూపాయల పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా తుపానులు, వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేశారు. త్వరలో కేంద్ర బృందం పర్యటన తర్వాత పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం అందించబోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.