
Telangana Rains: నేటి నుంచి ఈనెల 24 వరకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు బలపడటం, ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది.
ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 24వ వరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున బయట ప్రయాణాలు తగ్గించుకోవాలని సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిదని సూచించారు.
గడిచిన 24 గంటల్లో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడిలో అత్యధికంగా 1.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమెదురుగా వర్షాలు కురిశాయన్నారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, రైతులు తమ పంటలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి పరివాహాక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని బాబ్లీకి నిండు కుండులా తొణికిస లాడుతుంది. మరోవైపు ఆదిలాబాద్ నుంచి జయ శంకర్ భూపాలపల్లి నుంచి ఖమ్మం వరకు ప్రాజెక్టులు అప్పుడే పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు రైతులు కూడా సకాలంలో కురిసిన వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.