Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ హిట్.. రేవంత్ రెడ్డి ప్లాన్ అదుర్స్..

Telangana Rising Global Summit 2025:భారత్ ఫ్యూచర్​ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందా అంటే ఔననే చెప్పాలి. ఈ సమ్మిట్ తో రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అయిందా అంటే ఔననే చెప్పాలి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 9, 2025, 11:43 AM IST
Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ హిట్.. రేవంత్ రెడ్డి ప్లాన్ అదుర్స్..

తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ  అంతర్జాతీయ  సదస్సు తొలిరోజున పేరొందిన కంపెనీలు.. దేశ  విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజే సుమారు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35  ఎంఓయూల పై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం “విజన్ 2047” దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా  తన సుస్థిర స్థానాన్ని  చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి  శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Add Zee News as a Preferred Source

తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఒకే రోజున రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల సృష్టికి దోహదపడనున్నాయి. ప్రముఖ సంస్థలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకువచ్చాయి. ప్రత్యేకంగా, పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు రావటం విశేషం.

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

భారత్ ప్యూచర్​ సిటీలో బ్రుక్‌ఫీల్డ్  యాక్సిస్ వెంచర్స్ కూటమి 75 వేల  కోట్లతో  గ్లోబల్ రీసెర్చ్​ అండ్​ డెవెలప్‌మెంట్​, డీప్​ టెక్​ హబ్​ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్‌ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ 27 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. SIDBI స్టార్టప్​లకు వెయ్యి కోట్లు, వరల్డ్ ట్రేడ్‌​ సెంటర్​ ఇన్నోవేషన్​ హబ్​ ఏర్పాటుకు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక ఈవ్​రెన్​ యాక్సిస్​ ఎనర్జీ 31 వేల 500 కోట్లతో సోలార్ పవర్​ , విండ్ పవర్​ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మేఘా ఇంజనీరింగ్​  గ్రూప్ రూ.8 వేల కోట్లతో సోలార్, పంప్‌డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.

తొలి రోజే రూ. 2.43 లక్షల  కోట్ల పెట్టుబడులు రావడం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశీయ, అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని సీఎం రేవంత్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే  ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశలో బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు.

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News