)
Telangana Vimochana Dinothsavam: అప్పట్లో తెలంగాణను హైదరాబాద్ సంస్థానంగా పిలిచే వారు. ఈ ప్రాంతంలో తెలంగాణతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), కర్ణాటకలోని పలు ప్రాంతాలు ఉండేవి. అప్పట్లో హైదరాబాద్ సంస్తానంలో మొత్తం 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి ఉన్నాయి. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం సిద్ధించలేతు. దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లు ఊర్లపై పడి ప్రజల మాన, ప్రాణాలను దోచుకునే పనిలో పడ్డారు. హిందువులను క్రూరంగా హింసించి చంపిన సంఘటనలు కోకొల్లలు.
ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు స్వాతంత్య్రం రాకపూర్వమే 1947 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. వివిధ సంఘాలు పార్టీల ప్రతినిధులు, ప్రజాస్వామిక వాదుల, రచయతల, ఆర్య సమాజ్ సహా ప్రజల సంఘటిత పోరాటంతో హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం లభించింది.
నిజాం సంస్థానంలో జరగుతున్న దురాగతాలను తెలుసుకొని అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్ధార్ వల్లభ భాయ్ పటేల్.. జనరల్ జే.ఎన్. చౌదరి నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్యకు ఆదేశించారు. దానికి ‘ఆపరేషన్ పోలో’ పేరు పెట్టారు. సైన్యం రెండు భాగాలుగా విడిపోయింది. విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా రెండో బెటాలియన్ హైదరాబాద్ సంస్థానం దిశగా కదిలింది.
మొదట రజాకార్లు తిరగబడినా ఆ తర్వాత భారత మిలటరీ ముందు నిలబడలేపోయారు. తో లాభం లేదని నిరంకుశుడైన ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. ఏమి చేయాలో తెలియక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బంధించిన అప్పటి భారత ఏజెంట్ కే.ఎం.మున్షీని కలిసి భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో ‘ఆపరేషన్ పోలో’ సక్సెస్ అయింది. అప్పట్లో సైనిక చర్యకు అధ్యక్షత వహించిన సైనిక గవర్నర్ గా జే.ఎన్. చౌదరీ పదవీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎం.కే.వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.