Telangana Rains: శుక్రవారం హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసన వర్షాలతో జన జీనవం స్తంభించి పోయింది. ఇక రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, మల్కాజ్గిరీ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపుల, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సహా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ను కూడా ఆకాల వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి వుంటుందని భారత వాతావరణ కేంద్రం బాంబు పేల్చించింది. తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలి సుడులు వస్తాయని హెచ్చరించింది.
ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం వుందని , ప్రజలు జాగ్రత్తగా వుండాలంటూ అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. పగలు ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









