Tgsrtc management writes open letter to rtc employees: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మే చేస్తున్నామని ఇప్పటికే యాజామాన్యంకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దీనిపై రచ్చ నడుస్తుంది.ఈ నేథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమ్మే ఆలోచనను విరమించుకొవాలని రిక్వెస్ట్ చేశారు. ఈ సంస్థ మనదన్నారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటుదన్నారు. సమ్మేకు వెళ్లి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయోద్దని అన్నారు. మీ డిమాండ్ లను సీఎం రేవంత్ వరకు తీసుకెళ్తామని కూడా మంత్రి పొన్నంప్రభాకర్ ఆర్టీసీ సంఘాల నేతలు హమీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఆర్టీసీ యాజామాన్యం... తెలంగాణ ఉద్యోగులకు బహిరంగ లేఖను రాసింది.
ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న వేళ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సర్కారు.. ఆర్టీసీఉద్యోగుల సంక్షేమం విషయంలో ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయని యాజమాన్యంలేఖను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది.
Read more: Employee Unions: మేం బోనస్ అడగలే.. రేవంత్ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు గరం.. గరం.. ఏమన్నారంటే..?
ఈ క్రమంలో ఆర్టీసీ ఎస్మా చట్టం కిందకు వస్తుందని.. సమ్మేకు వెళ్లే కఠిన చర్యలుంటాయని ఆర్ఠీసీ యాజామాన్యం ఉద్యోగుల్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టసీ సంఘాలు సమ్మేపై ముందుకు వెళ్తాయా.. లేదా మళ్లీ విరమించుకుంటాయా.. అన్న దానిపై సంధిగ్దత నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









