)
Union minister kishan reddy slams on former cm kcr over jubilee hills bypolls: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు ప్రస్తుతం రాజకీయంగా రచ్చగా మారింది. ఈ క్రమంలో అన్నిపార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. టీడీపీ లో ఉన్న కార్యకర్తలు సానుభూతి చూపిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీ లు విమర్శలు చేసేటప్పుడు పరిమితికి లోబడి చేయాలన్నారు.
జూబ్లీహిల్స్ కి పాకిస్తాన్ కి లింక్ పెట్టడం సరికాదన్నారు. ఇచ్చిందే రెండు ఫ్రీ బస్, సన్న బియ్యమన్నారు. సన్న బియ్యం కేంద్రం వాటా ఎక్కువ అని తెల్చి చెప్పారు. ఫ్రీ బస్సు ఎక్కి రోజు షాపింగ్లు చేస్తున్నారన్నారు. బజార్ లో ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదని, చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళ లాగా చూస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్ చెప్తున్నారని ఎద్దేవా చేశారు. Mlc లో మేము గెలిచాం అప్పుడు కూడా బీఆర్ఎస్ మాకు సపోర్ట్ చేసిందా?.. అంటూ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న 7 బై ఎలక్షన్ల కోసం ఒకేసారి అభ్యర్థిలను ప్రకటించామన్నారు.
మేము ఎప్పుడూ సర్వే లు చేయలేదని.. ఫీల్డ్ పైన ఉండి ఒక్కో ఓటర్ను కలిశాక సర్వే చేయాల్సిన అవసరం లేదన్నారు. బూత్ స్థాయి నేతలను నమ్ముకున్నామని, బీజేపీకి మంచి స్పందన వస్తుందన్నారు. 40 మంది స్టార్ట్ క్యాంపెయినియర్ లను పెట్టుకోవచ్చన్నారు. రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదని అన్నారు. సన్నబియ్యంలో కేంద్రం ఇచ్చేవి రూ.42 ఉన్నాయి . దీనిలో రాష్ట్రానివి రూ.13 మాత్రమే ఉన్నాయన్నారు.
సీఎం నన్ను కోసినా రూపాయి లేదన్నారు, చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారని మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఫైర్ అయ్యారు. తామ బీజేపీ పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కూడా సర్వే చేయలేదని.. ఈ బైపోల్ కు కూడా చేయబోమన్నారు.
అజారుద్దీన్ వల్ల ఓట్లు వస్తాయని భావించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు.కానీ.. కాంగ్రెస్ కు మైనారీటీలపై చిత్తశుధ్ది లేదన్నారు. మరోవైపు మెట్రో ఫేస్ 2 కు సంబంధించిన డీపీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి ఇవ్వలేదన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వమంటే విజిలెన్స్ పేరిట బెదిరిస్తారా? అంటూ ఏకీపారేశారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల నష్టపోయేది యాజమాన్యాలు కాదు,విద్యార్థుల అంటూ కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై పంచ్ లు వేశారు. యాజమాన్యాలను భయపెడితే భయపడే పరిస్థితిలో లేవన్నారు. అంతే కాని రీయింబర్స్ మెంట్ అడిగితే విజిలెన్స్ దాడుల పేరిట ఎందుకు భయపెట్టడం అంటూ ఏకీపారేశారు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కేసీఆర్ ఎక్కడా ప్రజల్లో కనిపించడం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం మళ్ళీ తమదే అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారన్నారు. ఇది ఎంత వరకు జరిగేపని కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.