)
Vemulapally Nalgonda villages celebrates one day before Dussehra: దేవీ శరన్నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 2న దసరా పండగను జరుపుకుంటాం. అయితే ఈసారి దసరా పండగను మనం అంతా అక్టోబర్ 2న తేదీన జరుపు కోబోతున్నాం.
ముఖ్యంగా.. ఈసారి అక్టోబర్ 2న గాంధీ జయంతి పాటు దసరా కూడా ఒకేరోజున రావడంతో ఆరోజున జంతుబలి, మద్యం నిషేధం అని ఇప్పటికే పలు చోట్ల నిబంధనల్ని పాటిస్తున్నారు.చాలా మంది దసరా రోజు మాంసం, మద్యం తాగంది అసలు ఫెస్టివల్ జరుపుకున్నట్లు ఫీల్ కారు. ఇలాంటి నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని రావుల పెంట గ్రామంలోని ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఒక రోజు ముందుగానే.. దసరాను జరుపుకొవాలని గ్రామ పెద్దలు కూర్చుని నిర్ణయించుకున్నారు. తమ గ్రామంలో అనాదీగా గ్రామదేవతలకు మేకలు, కోళ్లను బలిచ్చే సంప్రదాయంను పాటిస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఈసారి దసరా రోజున గాంధీ జయంతి రావడం వల్ల ఇది కుదరదు. అందుకే గ్రామస్తులంతా కలసి బుధవారం రోజున అక్టోబర్ 1వ తేదీన దసరాను జరుపుకొవాలని నిర్ణయించుకున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు.ఈ క్రమంలో తమ సంప్రదాయంకు పెద్ద పీట వేసిన ఈ నిర్ణయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook