Anchor Shyamala: బెట్టింగ్ యాప్ కేసులో పోలీస్ స్టేషన్ కు హాజరైన యాంకర్ శ్యామల..

Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ను  ప్రమోషన్స్ లో పోలీసులు విచారణను వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ప్రశ్నించిన పోలీసులు.. తాజాగా ఈ కేసులో భాగంగా వైసీపీ నేత యాంకర్ శ్యామలను విచారిస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 24, 2025, 12:07 PM IST
Anchor Shyamala: బెట్టింగ్ యాప్ కేసులో పోలీస్ స్టేషన్ కు హాజరైన యాంకర్ శ్యామల..

Anchor Shyamala:బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ  నాయకురాలు, యాంకర్ శ్యామల  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.  బెట్టింగ్ యాప్స్ కు ఎందుకు ప్రమోట్ చేశారు. ఎంతంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే అంశాలపై ప్రశ్నిస్తారని తెలుస్తోంది. మంగళవారం  విష్ణు ప్రియ, రీతూలను మరోసారి  పోలీసులు విచారించనున్నారు.  

Add Zee News as a Preferred Source

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

హర్ష సాయి, ఇమ్రాన్ మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు  మియాపూర్ కేసులో మొదటగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మధ్యవర్తులను విచారించే అవకాశం ఉంది.  ఇంకోవైపు ఈ కేసులో ప్రకాష్ రాజ్ .. అప్పట్లో యాప్ ను ప్రమోట్ చేసిన మాట వాస్తవమే కానీ.. ఆ తర్వాత దాన్ని ప్రమోట్ చేయలేదని తెలివిగా సమాధానమిచ్చారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో తాను ఎంతో క్లారిటీతోనే చేసినట్టు వివరణ ఇచ్చారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News