)
Tirumala Temple Diwali: హిందూవుల అతి పెద్ద పండుగ దీపావళిని పురస్కరించుకుని తిరుమల ఆలయంలో ప్రత్యేక ఉత్సవం జరిగింది. ప్రతియేటా దీపావళి పండుగ రోజు దీపావళి ఆస్థానం పేరిట నిర్వహించే ఈ యేడు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో.. వైభవోపేతంగా దీపావళి ఆస్థానం వేద పండితులు నిర్వహించారు. దీపావళి ఉత్సవం సందర్భంగా ప్రత్యేక సేవలన్నింటిని రద్దు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారికి ఏకాంత సేవలు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు. మలయప్పస్వామి, భూదేవి అమ్మవార్లు విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించారు. అనంతరం ప్రసాద నివేదనలను అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు.
నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను అర్చకులు నివేదించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయ్యింది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.
పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఆదివారం శ్రీవారిని 84,017 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హుండీ ఆదాయం రూ.4.97 కోట్లు వచ్చింది. దీపావళి, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. దీనికి తగ్గట్టు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook