)
Woman attacks on drunken husband in Tirumala video: తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. శిలాతోరణం వరకు క్యూలైన్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉంటున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా.. శ్రీవారి దర్శనం కోసం.. మనదేశం నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు కొకొల్లలుగా వస్తున్నారు. తిరుమలలో ఇటీవల కొంత మంది కావాలని కాంట్రవర్సీగా మాట్లాడటం, వివాదస్పదంగా పనులు చేస్తున్నారు. టీటీడీ ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కూడా కొంతమంది చేసే పనుల వల్ల మొత్తంగా టీటీడీ తీరును భక్తులు తప్పుబడుతున్నారు.
పవిత్రమైన తిరుమల ఆలయ పరిసరాల్లో రాజకీయాలు మాట్లాడటం, మద్యం, మాంసం, అన్యమతం ప్రచారం, రీల్స్, వీడియోలు వంటివి చేయోద్దని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. కేసులు కూడా పెడతామని హెచ్చరికల్ని జారీ చేసింది.
ఈ క్రమంలో ఇటీవల మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తప్పతాగి ఏకంగా తిరుమలకు వచ్చాడు. అంతే కాకుండా శ్రీవారి మాడవీధుల్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించాడు. దీంతో అతని భార్య అతడికి బుద్ది చెప్పింది.
తిరుమల కొండపైకి ఒక వ్యక్తి తప్పతాగి వచ్చాడు. మరీ అతని భార్యకు తిరుమలలో కొండపైన ఏదో కొట్టు ఉన్నట్లుంది. ఇంతలో భర్త తప్పతాగి తిరుమల కొండపైకి రావడం చూసిన మహిళ సీరియస్ అయ్యింది. చీపురుతో ఉర్కించి కొట్టింది. అతను ఆపామని చెప్పిన కూడా తాగి వస్తావా..?.. అంటూ అతడిపై తన ప్రతాపం చూపించింది.
మొత్తంగా అందరి ముందే తన భర్త చేసిన పనికి అందరి ముందే బుద్ది చెబుతూ.. ఎక్కడ తాగి వచ్చావ్.. అంటూ ఆమె ఒకవైపు ఆందోళన చెందుతూనే, మరోవైపు భర్తను ఏకీపారేసింది. అతను మద్యం మత్తులో తూలుతూ.. తన భార్యను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఎవర్ని పిలుచుకున్న తనకు భయంలేదని చెబుతూ భర్త చేసిన పాడుపనిని మాత్రం తీవ్రంగా ఖండిస్తు దాడి చేసింది.
ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన శ్రీవారి భక్తులు మాత్రం టీటీడీ విజిలెన్స్ పై మండిపడుతున్నారు. అసలు తప్పతాగిన వాళ్లు కొండపైకి వస్తున్నారంటే.. టీటీడీ పోలీసులు, సిబ్బంది ఏంచేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. పవిత్రమైన తిరుమల పరిసరాల్లో ఈ న్యూసెన్స్ ఏంటని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.