ADO Foundation Donation To Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఏడీఓ ఫౌండేషన్ రూ.75 లక్షలను టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం అందించారు. సీఎస్ఆర్ కింద టీటీడీకి ఈ విరాళం అందించినట్లు ఏడీఓ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.