Nara Lokesh on Cyclone Montha: మంత్రి నారాలోకేష్ సైక్లోన్ మొంథా ప్రభావంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మొంథా తుపాను అత్యంత వేగంగా తీరానికి సమీపిస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం సహా పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యంత్రసామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి నారాలోకేష్ అధికారులకు సూచించారు. అవసరం అయితే.. ఆర్మీనిసైతం రంగంలోకిదింపుతామని అధికారులకు మంత్రి నారాలోకేష్ కీలకఆదేశాలు జారీ చేశారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం పోలీస్ శాఖ 81 టవర్లతో వైర్లెస్ వ్యవస్థను ఏర్పాటు