Tirumala: తిరుమల భక్తులు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అక్టోబర్ 29, 30 తేదీల్లో ఆర్జీత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 29న అంకురార్పణం కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా.. అక్టోబర్ 30న పుష్పయాగం తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు రద్దు చేస్తు ప్రకటన విడుదల చేసింది. కానీ శ్రీవారికి తోమాల సేవ, అర్చన ఏకాంతంలో నిర్వహించబడతాయని తెలిపింది.