)
Montha Cyclone: మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు నిత్యం సమీక్ష చేస్తూ అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇస్తున్నారు. రేపటి నుంచి పెరగనున్న తుఫాను ప్రభావం ఉండనుందని.. 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. తుఫాను ప్రభావంపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలెర్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
మొంథా తుఫాన్పై సోమవారం రాత్రి 10 గంటలకు మరోసారి తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్లో సమీక్ష చేశారు. తుఫాన్ ప్రభావం ఏపీపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని .. 338 మండలాలు, 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొంథా తుఫానుపై ఆందోళన వద్దని.. అప్రమత్తంగా ఉందామని సీఎం చంద్రబాబు తెలిపారు.
తుఫాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రియల్ టైమ్లో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని చెప్పారు. ఇప్పటివరకు తుఫాను సన్నద్దతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపై సీఎం సమీక్ష చేశారు. అధికారులు ఎన్ని సమీక్షలు నిర్వహించారనేది కాదు.. క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని తెలిపారు. దీనికి పబ్లిక్ పర్సెప్షన్ను ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పారు.
మొంథా తుఫానుపై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. తుఫానుకు సంబంధించిన జాగ్రత్తలపై మీమీ.. ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అని అంశంపై 70 శాతం మంది అవును అన్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెబుతున్నాయని అధికారులు వివరించారు. దీన్ని కొనసాగించాలని.. ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు వారి అవసరాలు, ఇబ్బందులు కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని.. రాష్ట్రస్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టిజీ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తుఫాను ముప్పు తప్పే వరకూ ప్రతీ శాఖ, ప్రతీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సీఎం ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి