)
Pawan Kalyan Review: ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత... సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కార్తీక మాసం రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు అవసరమని గుర్తుచేశారు. అన్నవరం, పాదగయ పిఠాపురం, పంచారామం, సామర్లకోటతోపాటు ఇతర ప్రముఖ ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు నిర్వహించాలని చెప్పారు.
కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
ప్రముఖ శైవ క్షేత్రాలు సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాద గయ, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతోపాటు పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి అందించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉండడంతో ఆలయాల్లో భక్తుల రద్దీని అంచనా వేసుకుని భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలని.. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. తాత్కాలిక మరుగు దొడ్ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణను స్థానిక సంస్థల యంత్రాంగం చేపట్టాలని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు నడపాలని తెలిపారు. రద్దీ సమయాల్లో జాతీయ రహదారులపై ప్రమాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని.. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల దగ్గర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి