)
YSRCP Social Media: ఏపీలో చంద్రబాబు వైఫల్యాలను తిప్పి కొడుతూ బలమైన పోరాటాలు చేయాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బహిరంగంగా.. అంతర్జాల వేదికగా కూడా పోరాటాలు చేయాలని తీర్మానం చేసింది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలన ఫలితాలను వివరిస్తూనే.. చంద్రబాబు చేస్తున్న మోసాలు.. వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అగ్ర నాయకులకు సోషల్ మీడియా విభాగానికి కీలక బాధ్యతలు అప్పగించింది.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం డిజిటల్ మీడియా విభాగానికి ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా శివశంకర్, హర్షవర్ధన్ కీలక ప్రసంగం చేశారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్పైకి తీసుకురావాలని.. జగన్ పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరించాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడదామని చెప్పారు.
'వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. డేటా బిల్డింగ్, డేటా స్టోరేజ్తో పాటు సోషల్ మీడియాలో పార్టీ గొంతుకను బలంగా తీసుకెళ్లడం మీ ప్రధాన కర్తవ్యం' అని సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోట్లాదిమంది అభిమానులు తమ వెంట ఉన్నారని ప్రకటించారు. జగన్ పాలనలో పేదలు, మధ్యతరగతి వారికి అందిన భరోసా అందరికీ తెలుసు అని.. కానీ కూటమి నాయకుల అబద్దాలతో చేసిన పనులు చెప్పుకోలేకపోయామని గుర్తుచేశారు.
వైఎస్సార్సీపీ వాణిని బలంగా వినిపించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని.. పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్పైకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్లకు సంబంధించి వివిధ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా డిజిటలైజ్ చేయాలని చెప్పారు. పార్టీ నిబంధనలు నియమాల మేరకు పనిచేస్తూ సత్తా చాటుకుంటే మళ్లీ జగన్ సీఎం అయ్యాక గుర్తింపు లభిస్తుందని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.
'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిబద్దత కలిగిన సైన్యం పనిచేస్తుంది. డిజిటల్ మేనేజర్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సమాచారం క్షేత్రస్ధాయి వరకూ తీసుకెళ్లాలి. జగన్ అడుగుజాడల్లో కోట్లాది మంది అభిమానులు నడుస్తూ మరోసారి జగన్ సీఎంగా చేసుకునేందుకు పని చేస్తున్నారు' అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. పార్టీ విధానాలు, సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లి కష్టపడి పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి