Botcha Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. చీపురుపల్లిలో డబుల్ యాక్షన్..!

Botcha Satyanarayana Daughter: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూతురు డాక్టర్ అనూష రాజకీయ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు గ్రౌండ్‌ లెవల్‌లో యాక్టివ్ అయ్యారు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 13, 2025, 05:08 PM IST
Botcha Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. చీపురుపల్లిలో డబుల్ యాక్షన్..!

Botcha Satyanarayana Daughter: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. త్వరలోనే ఆయన కూతరు డాక్టర్ అనూష రాజకీయ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాను యాక్టివ్‌గా ఉన్నప్పుడు వారసురాలును రాజకీయంగా అరంగేట్రం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అనూష కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె స్వయంగా డాక్టర్ కాబట్టి ఆ సమస్య తీవ్రతను.. ప్రైవేటీకరణ చేస్తే పేదలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు. ముఖ్యంగా పల్లెల్లో తిరుగుతూ ప్రభుత్వ చేపడుతున్న చర్యలను ఎత్తిచూపిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఇక నియోజకవర్గ సమస్యల విషయానికి వస్తే.. తండ్రి బొత్స సత్యనారాయణ తరహాలోనే పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. "మీ ఊరికి బొత్స గారు రాలేదని బాధపడకండి.. నేనున్నాను" అంటూ ప్రజలతో ముచ్చటిస్తున్నారు. రానున్న రోజుల్లో చీపురుపల్లి రాజకీయ ముఖచిత్రం మారబోతోందనడానికి ఆమె దూకుడే నిదర్శనమని కార్యకర్తలు అంటున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే.. తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

"జగనన్న ఉచిత వైద్యం తెస్తే.. కూటమి ప్రభత్వం ప్రజా వైద్యాన్ని తుంగలో తొక్కింది.." అంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున సంతకాలు సేకరిస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో డాక్టర్ అనూష పేరు గట్టిగానే వినిపిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఆమె మరింతగా ప్రజలకు చేరువయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలను సైతం పరుగులు పెట్టిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ వర్క్ పెద్ద ఎత్తునే చేసుకుంటున్నారు. 

ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డాక్టర్ అనూష డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రజలకు వైద్య సలహాలు అందిస్తూనే.. వారి సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గుర్ల, మెరకముడిదాం మండలాల్లో ఆమె రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రానుండడంతో ఈ రెండు మండలాల్లో ఒక చోట నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ముండు ZP ఛైర్ పర్సన్‌గా పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు కూతురు అనూష గ్రౌండ్ రిపోర్ట్‌ను కూడా బొత్స సత్యనారాయణ అడిగి తెలుసుకుంటున్నారట. పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తుండడంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. భవిష్యత్‌లో తాను రాజ్యసభకు వెళితే.. చీపురపల్లి నియోజకవర్గ బాధ్యతలను అనూషకు అప్పగించేందుకు రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉండడంతో ఆలోపు రాజకీయంగా మరింత యాక్టివ్‌గా ఉండేలా చూస్తున్నారు. ఓవరాల్‌గా బొత్స వారసురాలు రాజకీయ ఎంట్రీ ఖాయమైందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..12 రోజులు క్రిస్మస్ సెలవులు..డిసెంబరు 24 నుంచి జనవరి 5 వరకు నాన్‌స్టాప్!

Also Read: Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News