ప్రతి రోజు జొన్న దోస తింటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
';
ముఖ్యంగా జొన్న దోస తినడం వల్ల జీర్ణక్రియ కూడా ఎంతగానో మెరుగుపడుతుంది.
';
అంతేకాకుండా దీనిని తింటే సులభంగా బరువు కూడా తగ్గుతారు.
';
ముఖ్యంగా ప్రతి రోజు జొన్న దోసను తినడం వల్ల చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటుంది.
';
మీరు కూడా ఈ జొన్న దోసను తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.
';
జొన్న దోసకు కావలసిన పదార్థాలు: జొన్న పిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి
';
తయారీ విధానం..పిండిని కలపడం: ఒక పాత్రలో జొన్న పిండిని తీసుకొని అందులో నీటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దోసపిండిలా తయారు అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
';
ఉప్పు కలపడం: పిండిలో ఉప్పును వేసుకుని బాగా కలపండి. పిండి పలుచగా లేదా గట్టిగా ఉండకుండా సరైన మోతాదులో ఉండేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
పిండిని విశ్రమించనివ్వడం: పిండిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పిండిలోని పోషకాలు బాగా విడుదలవుతాయి.
';
దోస వేయడం: తవాను మంట మీద వేడి చేసి.. కొంచెం నూనె రాసి, తగినంత పిండిని తీసుకొని దోసను వేయండి.
';
తిరగేయడం: ఒక వైపు వేగిన తర్వాత మరో వైపు తిప్పి వేయండి. కావాలనుకుంటే వీటిపై చిన్న చిన్న కూరగాయల ముక్కలను కూడా వేసుకోవచ్చు.
';
సర్వ్ చేయడం: రెండు వైపులా బాగా వేగిన తర్వాత దోసను తీసి, మీకు ఇష్టమైన చట్నీ లేదా సాంబార్తో తినండి..