16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీని ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.

';

ఇటీవల ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో పురుషుల జట్టుతోపాటు మహిళల జట్టు కూడా పాల్గొని సందడి చేసింది.

';

ఈ ఈవెంట్ లో ఆర్‌సీబీ మహిళా జట్టుకు గౌరవ వందనంతో స్వాగతం పలకడంతోపాటు సన్మానం కూడా చేశారు.

';

ఈ సందర్భంగా మహిళా ప్లేయర్లు అందరూ విరాట్ కోహ్లీని కలిశారు. దాంతో వారందరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

';

ఇక శ్రేయాంక పాటిల్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్‌ను చూసి శ్రేయాంక పిచ్చెక్కిపోయింది.

';

అంతేకాకుండా అతడితో దిగిన ఫోటోను షేర్ చేసింది. కోహ్లీ నన్ను గుర్తు పట్టడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె తెలిపింది.

';

ఆర్‌సీబీ స్టార్ ఆశా శోభన కూడా విరాట్ కోహ్లీని కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

';

మరో ఫ్లేయర్ మేఘన కూడా ఒక ఫోటోను షేర్ చేసింది మరియు ఈవెంట్‌లో టైటిల్ విజయాన్ని కూడా ఆస్వాదించింది.

';

కొత్త జెర్సీ లాంచ్: రాబోయే సీజన్ కోసం కొత్త జెర్సీని అన్‌బాక్సింగ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేసింది ఆర్సీబీ.

';

మార్చి 22న తొలి మ్యాచ్‌: ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌ని మార్చి 22న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో చెపాక్‌లో ఆడనుంది.

';

VIEW ALL

Read Next Story