BLA Attack On Pakistan Army Video: పాకిసాన్కు బిగ్ షాక్ తగిలింది. భారత్తో యుద్ధానికి సై అంటే సై అంటూ రెచ్చిపోతున్న దాయాదికి గట్టి దెబ్బ తగిలింది. బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన దాడిలో పదిమంది సైనికులను పాకిస్తాన్ కోల్పోయింది. ప్రధానంగా ఈ బలుచిస్తాన్ ఆర్మీ ఎన్నో రోజులుగా స్వతంత్రం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జరిగిన దాడుల్లో పదిమంది సైనికులు మృతి చెందారు. పాక్ సైనికకులను లక్ష్యంగా చేసుకుని మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్ తో పేల్చేశారు. ఆ తర్వాత ఈ దాడి తమదే అని వీడియో విడుదల చేసింది బీఎల్ఏ. ఈ దాడిలో పది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గత మార్చి నెలలో కూడా బలుచిస్తాన్ లిబరేషన్ జరిపిన దాడుల్లో 60 మంది వరకు హతమైన సంగతి తెలిసిందే. భారత్తో యుద్ధం వేళ పాక్ ఇలాంటి దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
అదేవిధంగా ఈ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు చేసింది. బలుచిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేస్తోంది. మేం స్వాత్రంత్ర్యం కోసం పోరాడుతున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు ఉంటాయని హెచ్చరించింది. మేం నాశనం కోసం కాదు స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం దీనికోసం శత్రువులను లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంటామని ప్రకటించింది. ప్రస్తుతం భారత్ తో ఉన్న టెన్షన్స్ తో పాటు పాకిస్తాన్కు ఇది మరో తలనొప్పిగా మారింది అని చెప్పాలి. ఇక గురువారం కూడా బీఎల్ఏ మరో 7 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. ఈ దాడిలో ఎంతోమంది గాయాల పాలు కూడా అయ్యారు.
BREAKING: BLA BLASTS Pakistan Army convoy in PoK - 10 soldiers eliminated on the spot🔥
~ Baloch Liberation Army releases video of the strike, showing direct hits on military trucks.Bharat is yet to begin & PAK is already fckd up👏🏼pic.twitter.com/s62L1nLb8C
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) April 25, 2025
గత కొన్ని రోజుల క్రితమే BLA పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు కూడా హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ లిబరేషన్ ఆర్మీ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఇలాంటి దాడులకు బీఎల్ఏ తెగబడింది. అయితే భారత్ తో మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాక్ ప్రతికార దాడులు బలుచిస్తాన్పై మాత్రం చేయలేకపోతోంది.
ఇదిలా ఉండగా పహల్గాం దాడి తర్వాత మాత్రం పాకిస్తాన్ తమ దేశాన్ని అలెర్ట్ చేసింది. సైన్యాన్ని సిద్ధం కావాలని ఆదేశించింది. అంతే కాదు ఎల్ఓసీ వద్ద కవ్వింపు చర్యలు కూడా చేపట్టింది. వారి పనులకు మన భారత సైన్యం కూడా దీటుగానే జవాబు ఇచ్చింది .అయితే ఒకవైపు ఆఫ్గనిస్తాన్ మరోవైపు బలుచిస్తాన్ ఇలా మన భారత్తో యుద్ధం వేళ పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయినా కానీ భారత్ పై మాత్రం రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. కొత్త నిర్ణయాలు వీళ్లకు తగదు, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం..
ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.