)
Trump On India Over Tariffs: అమెరికా పెద్దన్న మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. ఇండియాను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ట్యారిఫ్స్ గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. ఇండియా, చైనా, బ్రెజిల్ సుంకాలు మనల్ని చంపేస్తున్నాయి. భారీగా సుంకాలు వసూలు చేస్తే ఇండియా నాకు జీరో టైప్స్ కూడా ఆఫర్ చేసింది. నా టారిఫ్ తోనే అది సాధ్యమైంది అని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున సుంకాలు విధించకపోతే జీరో టారిఫ్ ఆఫర్కు ఇండియా దిగిరాక పోతుండే.. అది నాకే సాధ్యమైంది అన్నారు. అయితే ఇప్పటివరకు రష్యాపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఓ జర్నలిస్టు అడగ్గా ఇండియా పై సుంకాలు అందులో భాగమే అని ట్రంప్ ఫైర్ అయ్యారు.
ఇండియా రష్యా నుంచి ఇంకా చమురు కొనుగోలు ఆపలేదు. కేవలం నేను సెకండరీ సుంకాలు మాత్రమే విధించాను. మూడో విడత చేపట్టలేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో భారత్ అత్యధిక సుంకాలు విధించే దేశం. నా వల్ల అలాంటి దేశం ఇప్పుడు సుంకాలను ఎత్తేస్తామని ముందుకు వచ్చింది. సుంకాలు ఇప్పుడు విధించకపోతే అది అలాగే బిజినెస్ చేసేది అని మంగళవారం మీడియా సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్ బాగానే బిజినెస్ చేసింది.. మనమే తెలివి తక్కువ తనంతో సుంకాలు విధించలేక పోయాం ..అది పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకుంది అని ఆయన అన్నారు.
రెండు వారాల ముందే చెప్పా..
రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు ఆపకపోతే భారీ పరిణామాలు ఎదురవుతాయని రెండు వారాల క్రితమే నేను చెప్పానని అన్నారు. అయితే మాస్కో పై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకు తాము తలొగ్గమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే. భారత రైతుల కోసం తాను అడ్డుగోడగా నిలబడతానని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల తమపై ఒత్తిడి పెరగవచ్చు కానీ దాని భరిస్తాం అని ఆయన అన్న సంగతి తెలిసిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.