
Trump Strong Warning To Iran Supreme Leader: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అణ ఒప్పందం పై సంతకం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు. సో కాల్డ్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసు. కానీ నిన్ను చంపడం మా ఉద్దేశం కాదు అది పెద్ద కష్టమేమి కాదు అని ఖమేనీని ఉద్దేశించి ట్రంప్ అన్నారు. ఇక ఇరాన్ ప్రజలు అమెరికా సైనికులకు హాని కలిగేలా మిస్సైల్స్ వేయాలనుకోవడం లేదు. ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాం లొంగిపోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
డోంట్ కేర్..
ఇక ట్రంప్ వార్నింగ్ కి ఏమాత్రం తగ్గని ఇరాన్ డోంట్ కేర్ అంటూ ఇజ్రాయిల్ పై అటాక్ చేస్తూనే ఉంది. ఏమాత్రం లెక్క చేయకుండా బాలిస్టిక్ మిస్సైల్స్ ని ఇజ్రాయిల్ పై విరుచుకుపడుతుంది. ఆ దేశంలోని డైనమో న్యూక్లియర్ ప్లాంట్ ను తాజాగా అటాక్ చేసింది. అంతేకాదు ఇరాన్ ఇజ్రాయిల్ లోని పలు ప్రాంతాల్లో మిస్సైలను వదులుతోంది. మరోవైపు టెల్ అవివ్లోని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ మొసాద్ కేంద్రాన్ని కూడా ఇరాన్ ధ్వంసం చేసేసింది. కానీ ఇరాన్ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా.. ఇజ్రాయిల్ మాత్రం ఖండించింది.
యుద్ధంలోకి యూఎస్..
ఒక ఇరాన్ అను కేంద్రాలపై దాడికి యుఎస్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కెనడా నుంచి అత్యవసరంగా నిన్న డోనాల్డ్ ట్రంప్ ఆకస్మాత్తుగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీ టీం తో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఇరాన్ ఇజ్రాయిల్ లో యుద్ధం పై 80 నిమిషాల పాటు ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక ఆ దేశం ఇంటలిజెన్స్ అధికారిక నివేదిక ప్రకారం టెహ్రాన్లోని న్యూక్లియర్ సైట్ పై ఇజ్రాయిల్ తో కలిసి దాడులకు చేయాలని యుఎస్ నిర్ణయించింది. ఇరాన్ ట్రంప్ను ఖాతరు చేయకపోవడం ప్రధాన కారణం అని తెలుస్తుంది. అయితే రాను రాను దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడాలి. ప్రధానంగా ఇజ్రాయిల్ అధికారులు ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యహు ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ రాబోయే రోజుల్లో ఇరాన్ భూగర్భ కేంద్రాన్ని బాంబు దాడి చేయడానికి యుద్ధంలోకి ప్రవేశించవచ్చని చెబుతున్నారు.
హౌతీలు రెడీ..
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా చేరితే అమెరికన్ స్థావరాలపై దాడి చేయడానికి ఇరాన్ కూడా యూఎస్పై దాడిచేయడానికి సైనిక పరికరాలు కూడా సిద్ధం చేసిందని అధికారుల అంచనా. మొదట్లో యుద్ధంలో తాము జోక్యం చేసుకోమని చెప్పిన అమెరికా.. ఇజ్రాయిల్ వైట్ హౌస్ పై ఒత్తిడి తెస్తూనే ఉండటంతో యుద్ధభయాలు పెరుగుతున్నాయి. అమెరికా ఇజ్రాయిల్ తో కలిసి తమపై దాడి చేస్తే హౌతి కచ్చితంగా ఎర్ర సముద్రంలో ఓడల పై దాడి చేయడం ప్రారంభిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా అక్కడ ఇరాక్, ఇరాన్ అనుకూల మిలీషియాలు అమెరికా స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook