Hassan Nasrallah: నస్రల్లా అంత్యక్రియల్లో హమాస్‌ మద్దతుదారుల నినాదాలు.. ఎంత జనం వచ్చారో చూడండి!

Hassan Nasrallah: హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే.   

Written by - Bhoomi | Last Updated : Feb 24, 2025, 01:42 PM IST
Hassan Nasrallah: నస్రల్లా అంత్యక్రియల్లో హమాస్‌ మద్దతుదారుల నినాదాలు.. ఎంత జనం వచ్చారో చూడండి!

Hassan Nasrallah: హిజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు ఆయన మద్దతుదారులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. గత ఏడాది సెప్టెంబరులో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన దాదాపు 5 నెలలకు లెబనాన్ రాజధాని బీరూట్ లో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సస్రల్లా బంధువు, హిజ్బుల్లా వారసుడిగా భావించిన హషీమ్ సఫీద్దీన్ కూ తుది విడ్కోలు పలకనున్నారు. ఇరువురికి నివాళులర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్ లోని స్టేడియం కిక్కిరిసిపోయింద. 

Add Zee News as a Preferred Source

గత ఏడాది సెప్టెంబర్ లో బీరూట్ దాహియా ప్రాంతంలోని హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లోనే నస్రల్లాతోపాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండ్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులకు మరో దాడిలో సఫీద్దీన్ కూడా మరణించారు. అప్పట్లో ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హిజ్బుల్లా ప్రకటించింది. ఈ క్రమంలోనే బీరూట్ లో నస్రల్లాను సపీద్దీన్ ను దక్షిణ లెబనాన్ లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్ లోని స్టేడియానికి తరలించింది. 

Also Read: Gold News: బంగారం కొంటే మేకింగ్ ఛార్జీలపై 25% ఫ్లాట్ డిస్కౌంట్ .. ఈ కంపెనీ అందిస్తోన్న గొప్ప ఆఫర్ ఇదే  

ఈ కార్యక్రమానికి 65దేశాల నుంచి 800 మంది ప్రముఖులు వచ్చినట్లు హిజ్బుల్లా వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఖాలిబఫ్, విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హాజరయ్యారు. అంత్యక్రియల సమయంలో బీరూట్ గగనతలంపై తమ యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతుండటంపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్ స్పందించారు. తమ దేశం జోలికి వస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే సందేశాన్ని చాటుతున్నట్లు చెప్పారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News