)
Pakistan Floods: మన దేశంలోనే కాదు.. పక్కనే ఉన్న మన శతృదేశాన్ని వరుణుడు ఒదలడం లేదు. ఇప్పటి మన దేశంలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో కొండ చరియలు విరగిపడ్డాయి. తాజాగా పాకిస్థాన్ లో పలు చోట్ల క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 220 మంది పైగా మృది చెందినట్టు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఈ వరదల్లో పలువురు గాయపడ్డారు. మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ఖైబర్పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్, జబ్రారీతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ జల విలయంతో ఈ విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా వుంది.
మరణాల సంఖ్య ఊహకు అందనంగా వుంటుందని భయపడుతున్నారు. వరదల కారణంగా పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని నీటితో కొట్టుకుపోయాయి. పలువురు ఇల్లు కోల్పోయి రోడ్డునపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ మొత్తం పర్వతలు, లోయలు అచ్చం జమ్మూ కాశ్మీర్ పోలీ ఉంటుంది. దీంతో అక్కడ వర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగాి వరదదాటికి వంతెనలు సైతం కొట్టుకుపోవడంతో బాధితులకు సహాయకచర్యలు అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇక పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని బల్టిస్థాన్ హైవే సహా పలు రహదారులు జలదిగ్బంధంలో వున్నాయి. నీరు తగ్గితేగానీ అక్కడి పరిస్థితిని అంచనా వేయలేమంటోంది అక్కడి ప్రభుత్వం .
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.