India - Pakistan: పాకిస్థాన్ కు మరో బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. మోడీ దెబ్బకు పాక్ గిలగిలా..

Bharat - Pakistan: మన దేశ పౌరులపై అకారణంగా కాల్పులు జరిపి వారి మరణాలకు కారణమైన పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా పాకిస్థాన్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను నిలిపివేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 24, 2025, 11:49 AM IST
India - Pakistan: పాకిస్థాన్ కు మరో బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. మోడీ దెబ్బకు పాక్ గిలగిలా..

Bharat - Pakistan:  మన దేశంపై ఉగ్రదాడికి కారణమైన పాపిష్ఠి పాకిస్థాన్ కు భారత దేశం కీలెరిగి వాత పెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న అన్ని దౌత్యపరమైన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు మన దేశంలో పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తోన్న 50 మంది పాక్ దేశస్థులను 30కి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు తాజాగా మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Add Zee News as a Preferred Source

దీంతో ఆ దేశంతో మాటలు లేవు.. మాట్లాడాలు లేవు అన్నట్టు పాకిస్థాన్ ను అష్ట దిగ్బందనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాకిస్థాన్  ప్రభుత్వ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాను భారత్ బ్యాన్ చేసింది..

ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే 'విత్అల్డ్' అని చూపిస్తోంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో ఎలాంటి సంప్రదింపులు చేయమని తెగేసి చెప్పినట్టైయింది. వారితో దౌత్యపరమైన చర్చలకు ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేసింది. అంతేకాదు భారత్, పాకిస్థాన్ ఇరు దేశాల  మధ్య రాక పోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసి పడేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్నీ రద్దు చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్ కు యాక్సెస్ లేకుండా అడ్డుకుని దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది.

భారత్‌లోని పాక్ పర్యాటకులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట సాగుతుంది.

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఎల్‌ఓసీ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించింది. ఈ రోజు డిఫెన్స్ మినిష్టర్ ఆధ్వర్యంలో అఖిల పక్ష భేటి జరగనుంది. అంతేకాదు ఈ భేటిలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతిపక్షంతో పాటు ఇతర పార్టీలకు వివరించే అవకాశం ఉంది. దేశ భద్రత దృష్ట్యా అన్ని పార్టీలు కేంద్రంలోని ప్రభుత్వానికి బేషరుతుగా మద్దతుగా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.  

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News