)
Mexico Double Decker Bus Accident Video: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డబుల్ డెక్కర్ బస్సును రైలు ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన సెప్టెంబర్ 8న మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్న అట్లాకో నగరంలో చోటుచేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు ను అకస్మాత్తుగా వచ్చిన ఓ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడ 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెక్సికో నగరం వ్యాప్తంగా ఇది తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ప్రమాదం స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. అది పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఎక్కువగా కర్మాగారాలు ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.
ఈ వీడియోలో రోడ్డు మార్గంలో ఇతర వాహనాలు వెళుతూ ఉండగా డబుల్ డెక్కర్ బస్సు మాత్రం ఓ రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రధానంగా ట్రాఫిక్ అక్కడ మొహరించి ఉంది సడన్గా రైలు రావడంతో రైలు పట్టాల మధ్య ఉన్న డబుల్ డెక్కర్ రైలు ఢీ కొట్టింది. చాలా దూరం వరకు ఈ బస్సును కూడా రైలు ఈడ్చుకెళ్లింది. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే రైలు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ సిగ్నల్ కనిపించలేదా? లేకపోతే ఏదైనా ఇతర కారణాల అని ఇంక తెలియాల్సి ఉంది. కొన్ని సెకన్లలో 8 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అనేక వాహనాలు అక్కడ రోడ్డు దాడుతున్న దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మెక్సికోలో ఇలాంటి ఘటన గతంలో కూడా జరిగింది. ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 2021 మే లో ఒక ఎలివేటెడ్ విభాగం రైలు పైకి వెళ్తుండగా కూలిపోయింది. ప్రమాదంలో 98 మందికి పైగా గాయపడ్డారు. ప్రధానంగా వెల్డింగ్ డిజైన్ లోపల ప్రమాదం జరిగినట్లు సమాచారం.
??? MEXICO BUS-TRAIN COLLISION
?A train collided with a double-deck bus in Atlacomulco, northwest of Mexico City, killing at least 8 people and injuring 45 early Monday. Authorities are still working at the crash site in an industrial zone. Cause remains under investigation.… pic.twitter.com/xd5hVtOshr
— Info Room (@InfoR00M) September 8, 2025
స్థానిక మీడియా సమాచారం మేరకు ఇటీవల రైలు ప్రమాదాలు సాధారణంగా మారిపోయాయి. ప్రధానంగా లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు ఘటన పెరిగిపోయింది. గత సంవత్సరం ఇలాంటి ప్రమాదాలు సంభవించగా 2020లో 602 నమోదయ్యాయి. ప్రమాదం పై ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయం కూడా దర్యాప్తు ప్రారంభించింది. హెర్రాడురా డి ప్లాట్ అనే బస్సు లైన్ కి చెందినది. గూడ్స్ రైలు క్రాసింగ్ సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook