)
Mohammed nizamuddin young techie shot dead by us cops: అమెరికాలో తరచుగా కాల్పుల ఘటనలు వార్తలలో ఉంటాయి. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా అమెరికాలో ఇలాంటి ఘటనలు ఆగడంలేదు. ముఖ్యంగా కొంత మంది భారతీయుల్ని టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగపడుతున్న ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా.. తెలంగాణలోని పాలమూరుకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి అమెరికా పోలీసుల కాల్పుల్లో దుర్మరణం చెందడం సంచలనంగా మారింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా పాలమూరుకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ కాలిఫోర్నియాలో తన మిత్రుతో కలసి గదిలో ఉంటున్నారు. అయితే.. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్మేట్తో గొడవ జరిగింది. ఇద్దరు పెద్దగా అరుస్తు గొడవకు దిగడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అప్పుడు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీరి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టుకని లోపలికి ప్రవేశించారు. నిజాముద్దీన్ చేతిలో కత్తి పట్టుకుని రూమ్ మెట్ పై దాడి చేశాడు. పోలీసులు నిజాముద్దీన్ ను లొంగిపోవాలని చెప్పారు. కానీ అతను వినకపోవడంతో దాడికి యత్నించాడు.
ఈ క్రమంలో పోలీసులు కాల్పులకు బలైనట్లు తెలుస్తొంది. ఈ ఘటనపై శాంతాక్లారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజాముద్దీన్ తండ్రి హస్నూద్దీన్ కు కర్ణాటకలో ఉండే ఒక విద్యార్థి ఈ విషయం చెప్పడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు.. నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం 2016లో అమెరికా వెళ్లారని అతని కుటుంబం తెలిపారు. ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకుని, ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా చనిపోవడం పట్ట కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే ఎయిర్ కండీషననర్ విషయంలో రూమ్మేట్తో జరిగిన గొడవ జరిగి అది కాస్త కత్తిపోట్ల వరకు వెళ్లిందని నిజాముద్దీన్ సన్నిహితులు చెబుతున్నారు. గొడవ సమయంలో మరో ఇద్దరు కూడా అదే గదిలో ఉన్నారని కూడా తెలుస్తొంది.
ఈ క్రమంలో తమ కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం కోసం హస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖను రాశారు. ఈ క్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు లేఖ రాశారు.
ఆ లేఖలో తన కొడుకును యూఎస్ పోలీసులు ఎందుకు కాల్చారోకూడా తెలిదని కూడా పేర్కొన్నారు. అదే విధంగా.. తమ కొడుకు డెడ్ బాడీని తొందరగా రప్పించేందుకు చర్యలుతీసుకొవాలని మహబూబ్ నగర్ వాసులు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా తమ గోడును చెప్పుకున్నారు .
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook