)
Nepal Lifts ban on social media after 19 killed: నేపాల్ లో ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకు వచ్చారు. అంతే కాకుండా.. పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇది కాస్త హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలో దిగారు. అంతే కాకుండా ఆందోళన కారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనల్లో ఆందోళన కారులకు, పోలీసులకు మధ్య రాళ్ల దాడి, ఫైరింగ్ లు జరిగాయి. ఈ ఘటనలో.. 19 మంది చనిపోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది.
అయితే.. ఈ అల్లర్లపై ఆందోళనల నేపథ్యంలో కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. అల్లర్లపై ప్రభుత్వం మంత్రులు, ఉన్నతాధికారులో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో ముఖ్యంగా అన్నిరకాల సోషల్ మీడియా బ్యాన్ లపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది.
నేపాల్లో ఇన్స్టా, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్తో పాటు 26 సోషల్ మీడియా యాప్లను శుక్రవారం నిలిచి పోయాయి. మరోవైపు.. సోషల్ మీడియాను నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై తమకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని గురుంగ్ వెల్లడించారు.
ప్రధాని కేపీ ఓలీ శర్మ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ.. నేపాల్ జాతీయ సార్వభౌమాధికారాన్ని అవమానించే విధంగా సోషల్ మీడియాలు ప్రవర్తించాయని, ఈ విషయం గురించి మే ఎక్స్ యాజమాన్యంతో ఏడాదిన్నరగా చెబుతూనే ఉన్నామన్నారు.
గడువు లోపల కమ్మూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందున 26 రకాల సోషల్ మీడియా సైట్ లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో ఆందోళన కారులు రోడ్లపైకి దూసుకొచ్చి జల ఫిరంగులు, టియర్ గ్యాస్ లు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనల్లో మొత్తంగా 19 మంది దుర్మరణం చెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం అల్లర్లు కంట్రోల్ అయిన కూడా మరల పలు చోట్ల అల్లల్లు జరుగుతుండంతో అధికారుల మరల అప్రమత్తమయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook