)
Nepal Gen-Z Protest: నేపాల్ పాలన ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 10:00 నుంచి లా అండ్ ఆర్డర్లో మార్పులు చేసి అధికారి గారికి ప్రకటన విడుదల చేసింది నేపాల్ ఆర్మీ. ప్రధానంగా యువత ఆందోళనలు నేపాల్ లో హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ఆందోళనను ఆసరాగా తీసుకొని కొన్ని ముఠాలు ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తూ నేరాలకు పారిపోతున్నట్లు తెలిపింది. అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. పరిస్థితులపై సమీక్షించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని కూడా ప్రకటించింది.
నేపాల్లో ప్రజల నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 22 మంది నిరసన కారులు సైనిక చర్యలు మరణించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. ఇప్పటికే పెద్ద పెద్ద బ్యాంకులు, షోరూంలు, దుకాణాలు, హోటల్లో కూడా దోచుకుంటున్నారు. ఇక మాజీ ప్రధాని జల్నాథ్ ఇంటిని ధ్వంసం చేసి ఆయన సతీమణి రాజ్యలక్ష్మికి కూడా నిప్పంటించారు. దీంతో ఆమె మరణించారు. ఇప్పటికే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారు. ఆయన నేపాల్ ని విడిచి పారిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
ఆ దేశం నుంచి పెద్దపెద్ద ప్రతినిధులు విమానాశ్రయం ద్వారా విదేశాలకు పారిపోయారు. అయితే ఇప్పటికే విదేశాలకు వెళ్లే విమానాలను కూడా నిలిపివేశారు నిరసనకారులు. విమానాశ్రయంలో కూడా నిప్పంటించి బాణాసంచా, లేజర్ లైట్ లను ఉపయోగించాలని కూడా చూస్తున్నారు.
నిన్న నేపాల్ కి చెందిన మంత్రులను వీధుల్లో పరిగెత్తించి దాడి చేసిన ఘటన కూడా తెలిసిందే. నిరసన కారులు కేవలం 2 గంటల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఈ నిరసనల్లో ఖాట్మండులోని సింగ్ దర్బార్ లయన్స్ పాలస్ అని కూడా పిలుస్తారు. ఇది నేపాల్ ప్రధాని ప్రధాన కార్యాలయం.. నేపాల్ రాజు రాజభవనంగా కూడా ఉండేది దీనికి కూడా నిప్పు పెట్టారు.
ప్రధానంగా నేపాల్ ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేక భావం ఉండటంతో ఈ నిరసనలకు దారితీసింది. ఇక నేపాల్ సుప్రీంకోర్టును కూడా లక్ష్యంగా చేసుకున్నారు. వెంటనే ఆ భవనాన్ని మూసేశారు వందలాదిమంది అటార్నీ జనరల్ కార్యాలయాలను కూడా ధ్వంసం చేసి నిప్పంటించారు. అక్కడి నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. భద్రత కోసం మొహరించిన సైనిక దళాలు కూడా అక్కడి నుంచి పారిపోయారు.
ప్రధానమంత్రి మోదీ స్పందన..
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్లో శాంతికి పిలుపునిచ్చారు. ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక నేపాల్ లో చోటు చేసుకున్న హింస చాలా హృదయా విధారకం అనే ఇందులో ప్రధానంగా యువకులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ చర్చించింది. నేపాల్ లో శాంతి శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం శాంతికి మద్దతు ఇవ్వాలని నేపాల్ సోదరీ సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్న అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook