Attari Wagah Border: బిజీగా మారిన అటారీ వాఘా బోర్డర్, రెండ్రోజుల్లో ఎంతమంది వెళ్లారంటే

Attari Wagah Border: పహల్గావ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ పౌరుల్ని దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఇండియా ఆదేశించడంతో రెండ్రోజులుగా వాఘా బోర్డర్ బిజీ అయిపోయింది. భారీగా పాక్ పౌరులు సరిహద్దు దాటుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2025, 09:42 PM IST
Attari Wagah Border: బిజీగా మారిన అటారీ వాఘా బోర్డర్, రెండ్రోజుల్లో ఎంతమంది వెళ్లారంటే

Attari Wagah Border: జమ్ము కాశ్మీర్ పహల్గావ్ ఉగ్రదాడి నేపధ్యంలో భారతదేశం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంది. పాక్ ప్రజలు, దౌత్య సిబ్బంది అంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని డెడ్‌లైన్ విధించడంతో అటారీ- వాఘా బోర్డర్ వద్ద సరిహద్దు దాటుతూ కన్పిస్తున్నారు. 

పహల్గావ్ ఉగ్రదాడితో పాకిస్తాన్‌ను అన్ని వైపుల్నించి దిగ్బంధం చేస్తోంది ఇండియా. ముందుగా పాకిస్తాన్ ప్రజలందర్నీ దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ దేశానికి మందులు ఇతర నిత్యావసర వస్తువులన్నింటినీ నిలిపివేసింది. సాక్ వీసాలు కలిగినవారిని ఈ నెల 27 అంటే ఇవాళ్టిలోగా వెళ్లిపోవల్సిందిగా ఆదేశించింది. మెడికల్ వీసాలు కలిగినవారిని ఈ నెల 29 వరకూ దేశం విడిచి వెళ్లాల్సిందిగా గడువు విధించింది. దౌత్య, అధికారిక వీసాలు కలిగినవారికి కొద్దిగా మినహాయింపు ఇచ్చింది. దేశం విడిచి వెళ్లే గడువు సమీపించడంతో అటారీ వాఘా బోర్డర్ బిజీగా మారిపోయింది. 

గత రెండ్రోజుల్లో 272 మంది దేశం విడిచి వెళ్లారు. ఏప్రిల్ 25వ తేదీన 191 మంది దేశం వదిలి వెళితే, 26న 81 మంది సరిహద్దు దాటారు. ఇక ఇవాళ చివరి రోజున భారీగా పాకిస్తాన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. చివరి రోజు ఎంతమంది దేశం దాటింది ఇంకా అధికారికంగా వెల్లడి కావల్సి ఉంది. వీరు కాకుండా విమానాల ద్వారా చాలామంది దేశం దాటి వెళ్లారు. ఇక పాకిస్తాన్‌లో ఉన్న 13 మంది దౌత్యవేత్తలు, అధికారులో కలిపి 629 మంది భారతీయులు పాకిస్తాన్ దాటి స్వదేశానికి వచ్చేశారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ కావడంతో పాకిస్తాన్ పౌరుల్ని సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణీత గడువులోకా దేశం విడిచి వెళ్లకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మెడికల్ వీసాలు కలిగినవారు మాత్రం ఈ నెల 29 వరకూ దేశం విడిచి వెళ్లిపోవల్సి ఉంటుంది. 

Also read: Supreme Court vs Parliament: న్యాయవ్యవస్థ వర్సెస్ పార్లమెంట్ ఏది గొప్పది, సుప్రీంకోర్టును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News