
Pig Liver To Human: దునియా బదల్ గయా.. అవును ప్రపంచంలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. తాజాగా వైద్య రంగంలో మరో అద్భుతం ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది లివర్ను ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఈ ఘనతను చైనాలోని షీజింగ్ హాస్పిటల్ వైద్యులు సాధించారు.
Pig Liver To Human: జన్యుపరంగా మార్చిన పంది కాలేయాన్ని బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తికి డాక్టర్లు విజయవంతంగా అమర్చారు. అది పది రోజుల పాటు బాగా పని చేసింది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి లేదా పేషెంట్ లివర్ తిరిగి జనరేట్ అయ్యేలోపు లివర్ ఫంక్షన్ను సపోర్టు చేయడానికి పంది కాలేయం ఒక బ్రిడ్జింగ్ అవయవంలా పని చేస్తుందని శాస్త్రం చెబుతున్నారు.
అమెరికా, చైనాలో సర్జన్లు ఇదివరకే పంది కిడ్నీలు, గుండె, థైమస్ గ్లాండ్ను పేషెంట్లకు మార్పిడి చేశారు. కానీ, పంది లివర్ను మనిషికి అమర్చడం ఇదే ఫస్ట్ టైం. ఓ యాక్సిడెంట్లో తలకు బలమైన గాయం కావడంతో ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు.
అతనికి పంది లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. పేషంట్ లివర్ను అలాగే ఉంచి పది గంటలపాటు సర్జరీ చేసి పంది లివర్ అమర్చారు. సర్జరీ తర్వాత పంది లివర్ సాధారణంగా పనిచేసిందని తెలుస్తోంది. మొత్తంగా వైద్య రంగంలో వస్తోన్న ఈ మార్పులు పెను మార్పులు మనిషిని సమూలంగా మార్చివేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe